పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)​ పూజ హెగ్డే జంటగా కలసి నటించిన చిత్రం  ‘రాధేశ్యామ్’​ (Radhe Shyam). ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్(Hindi Version)​కు బాలీవుడ్​ సూపర్ స్టార్ అమితాబ్​ బచ్చన్ (Amitabh Bachchan)​ వాయిస్​ ఓవర్​ ఇచ్చారు.  ఈ మేరకు బిగ్​బీ(Big B)కి కృతజ్ఞతలు తెలిపింది మూవీ యూనిట్ . ఈ మూవీని 250 కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మించారు.

ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలో ప్రేక్షకులను  అలరించడానికి మన ముందుకు వచ్చేస్తోంది. ప్రస్తుతం అమితాబ్, ప్రభాస్ కలిసి ‘ప్రాజెక్టు-కె’లో (Project-K) కలిసి నటిస్తున్నారు. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తుంది.

అంతేకాకుండా ప్రభాస్ సలార్, ఆదిపురుష్(AdhiPurush) సినిమాలతో బిజీగా ఉన్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

కృష్ణంరాజు(Krishnamraju), సచిన్ ఖేడేకర్(Sachi khedkar), భాగ్య శ్రీ(Bhagya Sri) మురళీ శర్మ(Murali Sharma) తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపీ కృష్ణ మూవీస్(Gopi Krishna Movies), యూవీ క్రియేష‌న్స్(Yuvi creations) పతాకాలపై వంశీ(Vamsi), ప్రమోద్(Pramodh), ప్రసీధ‌(Prasida) నిర్మించారు.

జస్టిన్ ప్రభాకరన్(Justice Prabhkaran) స్వరాలు సమకూర్చారు. తమన్(Thaman) నేపథ్య సంగీతం అందించాడు.