డైరెక్టర్ పరశురామ్(Parasuram) దర్శకత్వంలో, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు(Mahesh Babu) నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట'(Sarkari Vaari Pata).

ఈ సినిమాలో ‘మహానటి'(Mahanadi) మహేష్ బాబు సరసన కీర్తి సురేష్‌(Keerthi Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్(Teaser), పోస్టర్స్‌(Poster) తోపాటు కళావతి, ఎవ్రీ పెన్నీ సాంగ్స్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌(Update) వచ్చింది. ఈ న్యూస్ తో మహేష్ ఫాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. అదేంటంటే ఈ మూవీ  షూటింగ్‌ గురించి మేకర్స్(Makers) ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. సర్కారు వారి పాట’ షూటింగ్(Shooting) దాదాపు పూర్తయింది.

కేవలం ఒక్క  పాటను మాత్రమే షూట్‌ చేయాల్సి ఉంది.’ అని మూవీ యూనిట్  తెలిపింది. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఒక పాట చిత్రీకరిస్తే సినిమా అనుకున్న సమయానికే విడుదలవుతుంది కాబట్టి. వేసవి కానుకగా మే 12(May 12th)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) నిర్మిస్తోన్న, ఈ చిత్రానికి తమన్(Thaman) మ్యూజిక్‌(Music) డైరెక్టర్‌(Director)గా పనిచేస్తున్నారు.