స్మాల్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్ సీజన్లో 5 (Big boss season 5) ప్రారంభమై నెల రోజులు పూర్తి చేసుకుంది.

ఐదో వారం లో నామినేషన్(Nomination) లో అత్యంత ఓట్లు పొందిన షణ్ముఖ్. ఈ వారం కెప్టెన్ ఎంపికకు జరిగే టాస్క్ లో భాగంగా రాజ్యానికి ఒక్కరే రాజు అనే టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.

ఈ టాస్క్ లో  రవి-సన్నీలకు రెండు రాజ్యాలను ఇచ్చి హౌస్ మేట్స్(House mates) ని రెండు టీంలుగా విభజించారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు రాజ్యాధికారాన్ని దక్కించుకున్నారు? కెప్టెన్ పోటీదారులుగా ఎవరు గెలిచారన్నది బుధవారం రోజు 32వ ఎపిసోడ్‌లో చూసేద్దాం .

కుస్తీ పోటీలో భాగంగా రెండు రాజ్యాల నుంచి పోటీ పడటానికి ఒక్కో రాజ్యం నుంచి ముగ్గురు చొప్పున పోటీ పడాల్సి ఉంటుంది.

పోటీపడుతున్న వాళ్ల పేర్లు చెప్పాలని బిగ్ బాస్(Big boss) ఆదేశించడంతో రవి రాజ్యం నుంచి విశ్వ, శ్వేతా, యాని  పేర్లను, సన్నీ రాజ్యం నుంచి మానస్, జెస్సీ, పింకీలను ప్రకటించారు.

ముందుగా విశ్వ, మానస్‌లు పోటీ పడ్డారు. విశ్వ మంచి బాడీ బిల్డర్(Body builder) అవ్వడంతో  పైగా కుస్తీ పోటీల్లో కూడా అనుభవం వుంది .

మొదటి రౌండ్  (first round) లో మానస్ విశ్వ కి గట్టి పోటీనే ఇచ్చాడు. అయితే సంచాలకుడిగా ఉన్న శ్రీరామ్.. కింద పడ్డ విశ్వ వీపు మొత్తం నేలకు తాకలేదని చెప్పి రెండో రౌండ్ పెట్టాడు.

ఈ రౌండ్‌లో మానస్‌ని ఓడించాడు విశ్వ. ఇక  రవి టీంలో శ్రీరామ్, రవి ఇద్దరు మగాళ్లు ఉన్నప్పటికీ శ్వేత, ఆనీ మాస్టర్ పేర్లను కుస్తీ పోటీకి ప్రకటించడాన్ని మొదట సన్నీ వాదించాడు . ఇది కరెక్ట్ కాదని వాదించాడు.

ఇక శ్వేత కూడా మీరు ఇద్దరు మగాళ్లు ఉండి, మగాళ్లతో కుస్తీ పడమని ఆడవాళ్లని పంపడం సబబు కాదని రవిని నిలదీసింది.

శ్రీరామ్, నువ్వు ఉండగా ఆడవాళ్ల పేర్లు ఎందుకు చెప్పారని అడగ్గా వేరే కారణం ఉందిలే అని మాట దాటవేశాడు రవి. అయితే శ్రీరామ్, రవి కుస్తీ పోటీకి వెళ్లకుండా ఆడవాళ్లని పంపారు.

ఇద్దరు మగాళ్లు ఉండి.. ఆడవాళ్లని పంపారు. దీన్ని నేను ఒప్పుకోను నేను పొట్టి  చేస్తా అని సన్నీ  అన్నాడు. అయితే రవి, శ్రీరామ్‌లు మాత్రం ఒప్పుకోకుండా, యాని  మాస్టర్‌కి పోటీగా జెస్సీని కుస్తీ పోటికి పంపడంపై వ్యతిరేకత తెలిపారు.

ముందే ఫస్ట్  రౌండ్‌లో ఓడిపోయాం. ఇది కూడా ఓడిపోతే టాస్క్(task)  ఓడిపోయినట్టే అందుకే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని పంపుతున్నాం. కాదు  అంటే రవి, శ్రీరామ్  లలో  ఒకరు వచ్చి జెస్సీతో పోటీపడమని చెప్పాడు సన్నీ.

దానికి రవి, శ్రీరామ్‌లు ఒప్పుకోకపోవడంతో మానస్‌కి మండింది. ప్రతిసారి మేమే తగ్గుతున్నాం అని ఇర్రిటేట్ (irritate) అయ్యాడు.‘యాని మాస్టర్ కల్పించుకుని పోటీ కి సిద్ధమని జెస్సీని పిలిచింది. అయితే గట్టిపోటీ ఇచ్చిన యాని మాస్టర్ పై జెస్సీ గెలిచాడు.

Bigg-Boss-5-Telugu

అయితే  ఓ పక్క టాస్క్(Task) జరుగుతుంటే, టాస్క్ లో భాగంగానే  షణ్ముఖ్, సిరి, ప్రియాంకలు కాయిన్స్ దొంగతనం చేయడంతో విశ్వకి చిరెత్తుకొస్తుంది . బయటకు ఆడవాళ్లు గేమ్ ఆడుతుంటే లోపల కాయిన్స్ దొంగతనం చేశారు. దమ్ముంటే ఆడి గెలవాలి.కానీ ఈ దొంగ బుద్దులు ఏంటి? గుంటనక్కలు చాలామంది ఉన్నారు అని ఫైర్ అవ్వుతాడు. మధ్యలో మానస్ మాటలు సరిగా మాట్లాడు.

అందర్నీ అనకు, ఎవరు తీశారో పేరు చెప్పి అను అని అనడంతో ఇద్దరి మధ్య రచ్చ పెద్దదైంది. అయితే కాయిన్స్ కొట్టేసిన సిరి, షణ్ముఖ్‌లు గొడవను ఎంజాయ్ చేస్తూ సైలెంట్ గా ఉండిపోయారు.

ఇక మూడో కుస్తీ పోటీ ప్రియాంక, శ్వేతల మధ్య జరగ్గా ప్రియాంక పోటీ మొదలవ్వకముందే ప్రియాంక కింద పడిపోయింది.  దీంతో రవి టీం 2-1 తేడాతో సన్నీ టీంపై గెలిచింది.

ఇక రాత్రిపూట దుప్పటి కప్పుకుని జెస్సీ, సిరి, షణ్ముఖ్‌ నాణాలు పంచుకున్నారు. మరోపక్క హమీదా, శ్రీరామ్ ఎప్పటిలాగే సైగలు, హగ్ లు ఇచ్చుకుని గుడ్‌నైట్‌ చెప్పుకున్నారు.

తరువాత బిగ్‌బాస్‌(Big boss) హౌస్ మేట్స్ కు ‘రాజుగారి గోడ’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఖాళీ గోడలపై హౌస్‌మేట్స్‌(House mates) వారికి నచ్చిన రాజు ఫొటోలను అతికించాల్సి ఉంటుంది. ఎండ్‌ బజర్‌ మోగే సమయానికి ఏ రాకుమారుడి ఫొటోలు ఎక్కువ ఉంటే వారు గెలిచినట్లు ప్రకటించారు.

ఈ టాస్క్ లో  సన్నీకి సపోర్ట్‌(Support) గా మానస్‌, జెస్సీ పోటీలోకి దిగారు. ఈ క్రమంలో యువరాజు రవికి మద్దతుగా వచ్చిన విశ్వను ఆపేందుకు మానస్‌ గట్టిగానే ప్రయతించాడు.

జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేశాడు. అయితే శ్రీరామే జెస్సీని కొడుతున్నాడని, అది కళ్లారా చూశానని కోప్పడ్డాడు సన్నీ. దీంతో ఫైర్ (fire) అయ్యిన  శ్రీరామ్‌ ఏకంగా గోడను మొత్తం నేలకూల్చాడు. కానీ చివరగా ఈ టాస్క్‌ లో యువరాజు సన్నీ గెలవడం విశేషం. సన్నీ గెలుపును అభినందించిన షణ్ను, జెస్సీ చాలా  స్ట్రాంగ్ అని కానీ అది హౌస్ లో తెలియట్లేదు అంటూ సన్నీ తో చెప్తాడు.

ఇంతలో కాజల్‌ నాణాలు దొంగతనం చేయడం, అలాగే సన్నీ టీం కి వెళ్లిపోవడం రవి చూస్తాడు, . నాణాలు దొంగతనం చేయడం నేను చూసాను అని అఅడగ్గా డగా  అందుకు తగిన ఆధారాలు చూపించమంటూ వాదిస్తుంది కాజల్.

అడ్డంగా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నించిన కాజల్‌ బిహేవియర్ కి  ఆమెతో పెట్టుకుంటే  పనులు జరగవని ఆమెను అలా వదిలేశాడు. ఈ సీను అంతా చూసిన యానీ మాస్టర్‌ అసలు ప్రోవోక్‌ అనే అవార్డు ఉంటే అది కాజల్‌కే ఇవ్వాలి అంటుంది . ఇంతలో సిరి కూడా  రవి రాజ్యంలో నుంచి సన్నీ రాజ్యంలోకి చేరిపోతుంది.

ఆ తరువాత ‘లాక్కో లాక్కో తాడు’  అనే టాస్క్‌ ఆడించిన బిగ్ బాస్(Big boss). 

ఇందులో ఇద్దరు రాకుమారులతో పాటు, వారి ప్రజలు తాడును లాగాల్సి ఉంటుంది. ఏ రాకుమారుడైతే ఇతర రాజ్యంలోని ప్రజలను తమవైపు లాక్కుంటారో వారే విజేతలు అని చెప్పిన బిగ్ బాస్.

ఈ టాస్క్‌ లో మరోసారి యువరాజు సన్నీ విజయం సాధించడంతో అతడి ప్రజలు సంతోష పడతారు .

ఇక రేపటి ఎపిసోడ్‌ ప్రోమో(Promo)లో ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్‌ సర్ప్రైజ్(Surprise) ఇచ్చినట్లు తెలుస్తోంది.

ట్రాన్స్ జెండర్ గా  మారిన విషయాన్ని పింకీ తండ్రి స్వాగతించినట్లు, సాయి తేజ అంటూ మాట్లాడడం తెలుస్తోంది.

దీనితో ప్రియాంక ఎమోషనల్ అవ్వడమే కాకుండా హౌస్ మేట్స్(Housemates) అందరు కూడా ఎమోషనల్‌ అయ్యినట్లు ప్రోమో లో చూపించారు.