గత సంవత్సరం సాంఘిక నాటకం ‘జై భీమ్'(Jai Bheem) యొక్క అద్భుతమైన విజయం(Success) తర్వాత, నటుడు సూర్య(Actor Surya) తన రాబోయే చిత్రం Suriya41 వర్కింగ్ టైటిల్‌(Working Tittle)తో మార్చి 28, సోమవారం నాడు షూటింగ్(Shooting) ప్రారంభించినట్లు ప్రకటించారు.

ఈ చిత్రానికి దర్సకుడు బాల(Director Bala) దర్సకత్వం వహిస్తున్నారు.18 సంవత్సరాల తర్వాత సూర్యతో మళ్లీ కలిసి పని చేయనున్నారు. వీరి ఇద్దరి కంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం పితామగన్(Pithamagan). ఈ చిత్రానికి గాను దర్శకుడు బాల ప్రశంసలు అందుకున్నారు.

తమిళ స్టార్ హీరో సూర్య(Surya) మొదటి నుంచి కూడా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ చిత్రాలు  చేస్తున్నాడు.కొత్త కొత్త కథలను వెతికి మరీ సెలక్ట్ చేసుకుంటాడు సూర్య. అంతే కాదు సోషల్ మెసేజ్(Social Message) ఇచ్చే మూవీస్(Movies) లో రొల్స్ చేయడానికి ఉత్సాహాన్ని చూపుతాడు సూర్య.

ఆ మధ్య ఆకాశమే నీ హద్దుర తో పాటు జై భీమ్ సినిమాతో అదరగొట్టాడు సూర్య(Surya). ఈ రెండు సినిమాలు సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కలిసి ఉండటంతో బ్లాక్ బస్టర్ సక్సెస్(Block Buster Success) ని అందుకుంది.

ఇక ఆయన తాజాగా సినిమా ఈటి(Movie ET) మాత్రం నిరాశపరిచింది(Flop) సూర్యను. ఈ నెల 10న రిలీజ్ అయిన ఈసినిమా అంతగా ఆడలేదు.  పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై  పెరిగిన అంచనాలను అందుకోలేకపోయారు.

రెండు సినిమాల సక్సెస్ తరువాత ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నాడు సూర్య. కాని స్టార్ హీరో ఆశలు ఫలించలేదు.  ఇక ఈటి  సినిమా తరువాత సూర్య(Surya)తో సినిమా కోసం చాలా మంది దర్శకులు లైన్ లో ఉన్నారు. అంతే కాదు బోయాపాటి శ్రీను(Boyapati Sreenu)తో కలిసి డైరెక్ట్ తెలుగు మూవీ(Telugu Movie) చేయడానికి కూడా సూర్య ప్రయత్నిస్తున్నారు. కాని ఈ ప్రాజెక్ట్ కు ఇంకా టైమ్ పట్టనుంది. అటు తమిళం నుంచీ వెట్రిమారన్(Vetrimaran), బాలా లాంటి దర్శకుల ప్రాజెక్టులను సూర్య లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలను ఆయన ఒకే సమయంలో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.

ఇక ఇందులో ముందుగా బాలా డైరెక్షన్(Direction) లో ప్రయోగాత్మక సినిమా(Experimental Movie)ని అనౌన్స్(Announced) చేశాడు సూర్య.