శ్రీ కృష్ణుడి  మధురాతి మధురమైన మాటలు, చూపులు, నయనానందకరంగా రూపం, దరహాసం, కళ్ళలో దయ, అల్లరి చేష్టలు, అయన పిల్లనగ్రోవి నుండి జాలువారే సంగీతం సర్వసఙ్గ్యపరీత్యాగులైన యోగులే చూడకుండా ఉండలేరు. అలాంటిది ఎంతో కోరికలు కలవారు స్త్రీలైనా గోపికలేల చూడకుండా ఉండగలరంటారు.

మహా కవి పోతన(Pothana). శ్రీ ముఖ నామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, 4వ పాదం బుధవారం అర్ధరాత్రి భూలోకంలోని యదుకుల(Yadukula) వంశంలో జన్మిచాడు శ్రీకృష్ణుడు.

దేవకీ(Devaki), వసుదేవు(Vasudeva)లకు ఎనిమిదవ సంతానంగా సుమారు కి.పూ 3228 లో కంసుడి చెరసాలలో శ్రీ కృష్ణుడు జన్మిచాడని పూరణలు చెబుతున్నాయి ఆ రోజు ఉరుములు , మెరుపులా మధ్య ప్రకృతి ప్రళయ భీంకరంగా మరీనా రాత్రి వేళా అయన జన్మించారు.

శిలా శాసనాలు, పురాణాల(Puranas)లో ప్రస్తావన ఆధారాలుగా జరిగిన పరిశోధనల మేరకు అయన మనదేశపు అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లోని మధురలో జన్మించినట్టు తేలింది. శ్రీ కృష్ణుని జన్మ వృతాంతం  అత్యంత వేదనాభరితం, కమనీయం, అద్భుతమైన చరిత్రగా మహనీయులు వర్ణిస్తారు.

పురాణాల ప్రకారం మధురను పాలించే ఉగ్రసేనుడు(Ugrasenudu) వృద్ధుడు కావడంతో అత్యాశపరుడైన అతని కుమారుడు కంసుడు తన తండ్రిని కారాగారంలో బంధించి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. కంసుడి(Kamsa) తన సోదరి దేవకిని యాదవ రాజైన వసుదేవుడికిచ్చి వివాహం చేశాడు. సోదరి అంటే ఎంతగానే ప్రేమించే కంసుడు.. ఆమెను పెళ్లైన తరువాత అత్తవారింటికి పంపేందుకు స్వయంగా తానే రథం నడుపుతాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది.

ఓ కంసా! నీ సోదరిని పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. ఆమెకు పుట్టే ఎనిమిదో సంతానం వల్ల నీకు ప్రాణగండం ఉంది. ఇదే నీ అంతం అని పలికింది. దీంతో ఒక్కసారిగా ఉగ్రుడైన కంసుడు… ఓహో, ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన అష్టమ సంతానానికి ఎలా జన్మనిస్తుందో నేనూ చూస్తాను’ అని హూంకరిస్తాడు.

అక్కడే కత్తి తీసి దేవకి తల నరకబోతుంటే వసుదేవుడు కంసుడిని వేడుకుంటాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలనందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్లని చంపవచ్చు. కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు’ అని వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు.

కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని, బావను గృహనిర్బంధంలో ఉంచి కొంతమందిని కాపలా ఉంచుతాడు. తొలి సంతానం పుట్టగానే కాపలాదారులు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకీ వసుదేవులు.. ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమమని ప్రాధేయపడతారు.

కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతీ సారీ ఒక శిశువు జన్మించటం, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎంతగా ప్రాధేయపడినా, ఎవరినీ ప్రాణాలతో వదిలేయక హతమార్చాడు.

ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండగా అష్టమ సంతానానికి దేవకి జన్మనిచ్చింది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలావాళ్లు అందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని, ఎదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నదివైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నంద, యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది.

అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి, ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలావాళ్లు వెళ్లి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలావాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు.

ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లాడు అయ్యుంటే అతను నిన్ను చంప గలిగేవాడేమో. కాని ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు’ అని కంసుడిని దేవకీ వసుదేవులు అర్ధిస్తారు. కానీ కంసుడు కనికరించడు.

ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్లి ‘నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం(Gokulam) చేరిన కృష్ణుడు, రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు.

శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమి(Sri Krishnashtami)గా జరుపుకుంటున్నాం. శ్రీ కృష్ణుడు జన్మించిన రోజున దేశంలోని గ్రామాల(Villages)లో, పట్టణాల(Cities)లో  ఇప్పటికి శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఘనం(Grandly)గా జరుపుకుంటున్నారు.