ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప2(Pushpa 2) . పుష్ప ది రైజ్ పార్ట్ 1 మూవీ తెలుగులోనే కాదు.. రిలీజైన అన్ని భాషల్లోనూ సక్సెస్(Success) అందుకుంది.

ముఖ్యంగా పుష్ప మూవీతో పాటు అందులోని పాటలు, డైలాగ్స్‌(Dialogues) కి ప్రేక్షకుల(Audience)  నుంచి హ్యూజ్ రెస్పాన్స్(Huge Response) వచ్చింది. పుష్ప, పుష్పరాజ్, అలాగే తగ్గేదేలే డైలాగ్ నుండి సామి సామి సాంగ్  వరకు ప్రతీ పాట, ప్రతీ డైలాగ్ భారీగా పాపులర్(Popular) అయ్యాయి.

దీంతో ఇప్పటికే అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ ఆలా తార స్థాయికి  పెరిగిపోయింది. అల్లు అర్జున్ సరసన జోడి(Pair)గా నటించిన రష్మిక మందన(Rashmika Mandanna)కు కూడా నేషనల్ వైడ్ ఫేమ్(National Wide Fame) తెచ్చి పెట్టిందనే చెప్పాలి పుష్ప మూవీ..

అల్లు అర్జున్‌కి, రష్మిక మందనకు, దర్శకుడు(Director) సుకుమార్‌(Sukumar)కి అంత గుర్తింపును తీసుకొచ్చిన పుష్ప మూవీ రెండో భాగం పుష్ప ది రూల్ సెట్స్‌ పైకి వెళ్లాల్సి ఉంది. పుష్ప 2 మూవీ ఆగస్టు(August)లో సెట్స్‌(Sets) పైకి వెళ్లనుందని మొదట్లో వార్తలొచ్చినప్పటికీ.. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అంతకంటే ఒక నెల ముందుగానే అంటే జూలై నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా పుష్ప 2 మూవీ అప్ డేట్స్(Updates) కోసం వేచిచూస్తున్న ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా(Social Media)లో అల్లు అర్జున్ అభిమాని(Fan) ఒకరు చేసిన ట్విటర్ పోస్ట్(Twitter Post) నెటిజెన్స్(Netizens) దృష్టిని ఆకర్షించకుండాపోలేదు.

పుష్ప పార్ట్ 2 మూవీ గురించి అల్లు అర్జున్ అభిమాని చేసిన ఆ ట్వీట్‌లో ఏముందంటే, పుష్ప పార్ట్ 2 మూవీ రూ. 400 కోట్ల (400 Crores) బడ్టెట్‌(Budget)తో తెరకెక్కనుందని, జూలై 2022 లో పట్టాలెక్కనున్న ఈ సినిమా, వచ్చే ఏడాది వేసవి సెలవులు నాటికి రిలీజ్ కానుందని సదరు అభిమాని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

హీరోల అభిమానులు చేసే ట్వీట్స్ ఎప్పుడూ అధికారిక ప్రకటనలు కానప్పటికీ, అందులో అతడు పేర్కొన్న రూ.400 కోట్ల భారీ బడ్జెట్ అనే వివరాలు మాత్రం నెటిజెన్స్‌ లో చర్చకు దారితీశాయి.

పుష్ప ది రైజ్ మూవీ టోటల్ రన్‌(Total Run)లోనే రూ. 400 కోట్ల వసూళ్లు(Collections) సాధించలేదని.. అటువంటప్పుడు పుష్ప ది రూల్(Puspha The Rule) కోసం అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ వెచ్చించి సినిమా ఎలా తీస్తారంటూ కొంతమంది నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.