బిగ్ బాస్ సీజన్5 (Big boss season5) మొదలయ్యిన తొలి రోజు నుంచే కంటెస్టెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రెండో రోజు నామినేషన్  (nomination) ప్రక్రియ లోను హౌస్ మేట్స్ మధ్య హీట్ డిస్కషన్స్ జరిగాయి. చివరికి మొదటి వారం 6 ఆరుగురు ఎలిమినేషన్(elimination) కి నామినేట్ అయ్యారు.

ఆ తరువాత ఈ సీజన్ కి మొదటి టాస్క్ గా పవర్ రూమ్(power house) టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్(Big boss).

ఈ సీజన్ మొదటి  కెప్టెన్ ని సెలెక్ట్ చేయడం కోసం హౌస్ మేట్స్(house mates) మధ్య గట్టి పోటీ నే జరుగుతోంది.

ఇక మూడో రోజు ఎపిసోడ్లో నిన్న జరిగిన గొడవపై జెస్సీ ఎమోషనల్ అయ్యాడు. ఆనీ మాస్టర్ దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకుని మరీ క్షమాపణ కోరాడు. మీరు నా తల్లి లాంటి వాళ్లు తప్పునాదే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఏంటి తల్లి లాంటి దాన్నా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆనీ మాస్టర్. ఆ తరువాత యాని మాస్టర్ కూడా అరవడం నాది కూడా తప్పే అని సారీ చెప్తూ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టింది.

కాజల్ కు మానస్ ఇచ్చిన టాస్క్ లో భాగం గా ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నాకే నిద్రపోవాల్సి ఉండడంతో కాజల్ హౌస్ మేట్స్ ని నిద్రపోవడానికి కన్వెన్స్ చేయడానికి ట్రై చేసింది.

కానీ లహరి మాత్రం తాను నిద్రపోవడానికి ఎట్టి పరిస్థిత్లోనూ ఒప్పుకోకపోవడం తో మరో సారి  లహరి కాజల్ మధ్య అర్గుమెంట్స్ జరిగింది.

కానీ ఈ టాస్క్ వెనుక ఏదో సీక్రెట్ దాగివుందనే అనుమానంతో హౌస్ మేట్స్(house mates ) కొంతమంది నిద్ర వచ్చినా, నిద్రపోకుండా జాగారం చేశారు.

ఇక లాభం లేదనుకుందో ఏమో కాజల్ కూడా జాగారం చేసింది అయితే మధ్యలో ఒకటి రెండు సార్లు నిద్రలోకి జారుకోవడం తో అలారం మోగి హౌస్ మేట్స్ నిద్ర కు డిస్ట్రబెన్స్ ఏర్పడింది.

ఆ తరువాత హమీద, లహరిల మధ్య గొడవ జరిగింది.‘నువ్వు ప్రతిసారి నాతో మాట్లాడేటప్పుడు అలా రిప్లై చేస్తావ్ ఎందుకు అని లహరి హమీదాతో గొడవకు దిగింది.‘నేను ఎలా మాట్లాడాలో మీరు నేర్పించాల్సిన అవసరం లేదు’అని తిరిగి రిప్లై ఇచ్చింది హమీద. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఇక్కడ కుదరదు, సెన్స్ లేదా?? నేనేం నీ దగ్గర పనిచేయడం లేదు’ అంటూ హామీదను అరిచింది లహరి .

ఆ తరువాత  ప్రియ దగ్గర హమీద బిహేవియర్ గురించి చెప్తూ ఏడిచింది. ఆ తరువాత గొడవ గురించి కూల్ గా  మాట్లాడుకుని ఒకరిఒక్కరు హాగ్ చేసుకుని గొడవను సాల్వ్ చేసుకున్నారు. కాగా లహరి హమీదాల మధ్య మొదటి రోజునుంచే గొడవపడడం తెలిసిందే.

ఇక ఉదయాన్నే కిచెన్‌లో గిన్నెలు కడగడంపై ప్రియ, కాజల్‌ల మధ్య డిస్కషన్ నడించింది.

నేను కేవలం వంట మాత్రమే చేస్తానని గిన్నెలు కడగడం నా వల్ల కాదు, నేను ఇంట్లో కూడా గిన్నెలు క్లీన్ చేయను అని చెప్పింది కాజల్.

అయితే కేవలం వంట చేయడం మాత్రమే కాదు. అన్నీ చేసుకోవాలి ఇంటి దగ్గర  నేను కూడా చేయను కానీ ఇక్కడ చేసుకోవాలని ప్రియా  చెప్పింది.

మరో పక్క ఉమాదేవి, యానీ ల  మధ్య వంట విషయంలో పెద్ద రచ్చ జరిగింది. తను అడిగితే కూర లేదని చెప్పిన వాళ్ళు ,

ఆ తర్వాత వారి కోసం కూర ఎలా ఇచ్చారని, వేరొకరి కోసం ఫ్రిజ్ లో కూరలు ఎలా దాస్తారంటూ ఉమాదేవి యానీ మాస్టర్ తో గట్టిగానే వాదనకు దిగింది. యానీ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా, ఉమాదేవి వినకపోవడం ఆర్చర్యానికి గురి చేసింది. ఉమాదేవి కర్రీ విషయం లో ఎదో కావాలనే గొడవ పెట్టుకున్నారనిపిస్తుంది.

విశ్వ, మానస్ తర్వాత పవర్ రూమ్ విన్నర్ గా సిరి సాధించింది .దాంతో ఇంటి సభ్యుల్లో  ఒకరిని యజమానిగా, మరొకరిని సర్వెంట్ గా ఎంచుకోమని బిగ్ బాస్(Big boss) చెప్పగా, షణ్ముఖ్ ని  యజమానిగా, లోబోను సర్వెంట్ గా సెలెక్ట్  చేసింది.

ఈ టాస్క్ ను సైతం వారు కామెడీగా తీసుకోవడంతో బిగ్ బాస్ సిరి కి వార్నింగ్ బెల్స్ ఇచ్చాడు.  ఇది ఇలా ఉంటే కాన్సర్ తో చనిపోయిన తన కూతురును తలుచుకుని ప్రియా కాస్త ఎమోషనల్ అయ్యారు.

మరో పక్క  శ్రీరామచంద్ర, హమీదా మధ్య లవ్‌ ట్రాక్‌ మొదలైనట్లు చూపించిన ప్రోమో అంతా ఎపిసోడ్ హైప్ చేయడానికే తప్ప నిజంలేదని తేలిపోయింది. ఫ్రెండ్లీ గా  వీరిద్దరూ కాసేపు కబుర్లాడారు తప్ప అంత మేటర్ ఏమి జరగలేదు.

ఆ తర్వాత కాజల్‌, సింగర్‌ శ్రీరామచంద్రను ఎలాంటి అమ్మాయి నచ్చుతుందని అడగ్గా.సరదాగా, బబ్లీగా ఉండే అమ్మాయి ఇష్టమని చెప్పాడు. మొదటి రెండు రోజులు కనిపించని శ్రీరామచంద్ర ఈ ఎపిసోడ్లో ఇంట్రస్టింగ్ టాపిక్ తోనే కనిపించాడు.

రవి మానస్ ని ప్రియాంక తో ముడి పెట్టి మాట్లాడడం మానస కి నచ్చలేదు, దాంతో రవి పై కాస్త అసహనం చూపించిన మానస్  ఇక పవర్ బజ్ టాస్క్ లో భాగం గా లోబో కామెడీ తో ఆకట్టుకున్నాడు.

మొత్తానికి  మూడో రోజు కూడా ఏడుపులు, హీట్ డిస్కషన్స్ తో ముగిసింది. చెప్పాలంటే పెద్ద గా  ఆడియెన్స్(audience) రేంజ్ కి రీచ్ అవ్వలేదనే చెప్పాలి.

రేపటి ఎపిసోడ్ లో ఎలాంటి  టాస్క్ లు ఉన్నాయో?  ఎన్ని ట్విస్ట్ లో ఉన్నాయో చూడాలి.