తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలతిరుపతి దేవస్థానం (TTD) మార్చి 1 నుంచి భక్తులకు ఫేషియల్ రికగ్నిషన్ (Facial Recognition) టెక్నాలజీని ఉపయోగించనుంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చే శ్రీవారి భక్తులకు టోకెన్లు(Tokens) లేకుండా దర్శనం కల్పించడం, వసతి కేటాయించడంలో పారదర్శకత(Transparent) కోసం టీటీడీఈ(TTDE) టెక్నాలజీ(Technology) ఉపయోగించుకోనుంది.

సర్వదర్శనం కాంప్లెక్స్‌ లో భక్తులు ఎక్కువ టోకెన్స్ తీసుకోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని టీటీడీ భావిస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని సర్వదర్శనం కౌంటర్, టోకెన్‌లెస్ దర్శనం, లడ్డూల పంపిణీ, వసతి అలాట్‌మెంట్, కాషన్ డిపాజిట్ రీఫండ్(Cash Deposit Refund), ఇతర ప్రాంతాల్లో ఉపయోగించనుంది టీటీడీ. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

టీటీడీ మార్చి 1 (March 1) నుంచి వైకుంఠం 2(Vaikuntam 2), ఏఎంఎస్ సిస్టమ్స్‌(AMS System) లో ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రారంభించనుంది. దర్శనం కోసం నమోదు చేసుకునే సమయంలో ఎంట్రీ పాయింట్ దగ్గర ప్రతీ భక్తుడిని ఫోటో తీస్తారు. అప్పటికే టీటీడీ దగ్గర ఉన్న డేటా బ్యాంకులో ఉన్న డేటాతో భక్తుడి ముఖాన్ని పోల్చి చూస్తారు. తద్వారా టీటీడీ అందిస్తున్న సేవల్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారా, ఎక్కువ టోకెన్లు తీసుకుంటున్నారా అని పరిశీలిస్తారు.

మొదటిసారి భక్తుడి ఫేస్‌(Pligrim Face)ను గుర్తించిన తర్వాత ఆ డేటా టీటీడీ దగ్గర ఉంటుంది. ఒకవేళ అదే భక్తుడు మళ్లీ టోకెన్ కోసం వస్తే పాత డేటా(Old Data) ద్వారా సులువుగా గుర్తించవచ్చు.

అంతే కాదు టికెట్ తీసుకున్న భక్తుడే ఆలయంలోకి వెళ్తున్నాడా అని కూడా పరిశీలిస్తారు. ఆలయంలోకి వెళ్లేముందు కెమెరా(Camera) ముందు నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు ఫోటో క్లిక్ చేస్తారు.

అప్పటికే డేటా బ్యాంకు(Data Bank) లో ఉన్న ఫోటోతో, ఆ టికెట్ మ్యాచ్ అయితే ఆలయంలోకి వెళ్లడానికి అనుమతిస్తారు. లేకపోతే టీటీడీ చర్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఆధార్ కార్డుల్ని చెక్ చేసేవారు. వివరాలను మ్యాన్యువల్‌(Manual)గా ఎంటర్ చేసేవారు. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు.

ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అమలు చేశారంటే, తిరుమలకు వచ్చే ప్రతీ భక్తుడిపై డిజిటల్ నిఘా ఉంటుంది. సుమారు 3,000 కెమెరాలు భక్తుల్ని గమనిస్తుంటాయి. ఒక్కసారి ఓ భక్తుడు ఎన్‌రోల్‌మెంట్(Enrollment) చేసుకున్నాడంటే, ఎంట్రీ పాయింట్ దగ్గర, దర్శనానికివెళ్లేప్పుడు, లడ్డూ ప్రసాదం తీసుకునే దగ్గర కెమెరాలు గమనిస్తూనే ఉంటాయి.

లడ్డూ కౌంటర్లను నిర్వహించే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది లడ్డూల పంపిణీ ప్రక్రియ(Distribution Process)ను దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట పడుతుంది. భక్తులకు వసతి సౌకర్యం కూడా ఫేషియల్ రికగ్నిషన్‌తో మ్యాచ్ అయిన తర్వాతే ఇస్తారు.

ఒకవేళ ఎవరైనా ఆధార్ కార్డు(Aadhar Card)sను దుర్వినియోగం చేసినా, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఆ అక్రమాలకు చెక్ పెట్టొచ్చని టీటీడీ భావిస్తోంది. ఇప్పటికే సర్వదర్శనం కోసం ఈ టెక్నాలజీని ఉపయోగించింది టీటీడీ. ఎక్కడా ఇబ్బందులు రాలేదు.

వసతి కేటాయింపులో కూడా ఈ టెక్నాలజీని 45 రోజుల పాటు ఉపయోగించనుంది. టీటీడీ సేకరించే భక్తుల డేటా టీటీడీ లోకల్ డేటా సెంటర్‌లోనే స్టోర్ అవుతుంది. బయటి వ్యక్తులకు ఈ డేటా అందుబాటులో ఉండదు.