ప్రముఖ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft)​ నిరుద్యోగులకు శుభవార్త  చెప్పింది. సైబర్​ సెక్యూరిటీని (Cyber Security) కెరీర్(Career)​గా తీసుకునే వారి కోసం ప్రత్యేక ట్రైనింగ్​ ప్రోగ్రామ్(Special Training program)​ను ఆవిష్కరించింది. మంగళవారం అధికారికంగా ఈ సైబర్‌ సెక్యూరిటీ స్కిల్లింగ్(Skilling) ప్రోగ్రామ్‌ను  ప్రకటించింది.

కరోనా(Corona) వైరస్ తరువాత డిజిటల్ లెర్నింగ్​కు ఆదరణ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త కోర్సును (New Course) రూపొందించింది. సైబర్‌ సెక్యూరిటీలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్‌(Demand) పెరిగిందని, ఎక్కువ మంది నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించనట్లు టెక్‌ దిగ్గజం ఓ ప్రకటనలో పేర్కొంది. మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఇదే కావడం విశేషం.

ఈ ప్రోగ్రామ్​ ద్వారా 2022 సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో 1 లక్ష మందికి పైగా స్కిల్ శిక్షణ(Skill Training) ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్​ థట్(Cloud that)​,  కోయినింగ్(Koenig), ఆర్​పీఎస్(RPS)​, సినర్జిటిక్స్(Synergetics)​ లెర్నింగ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందించనుంది.

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా లెర్నర్స్​(Learners)కు జాబ్ ఛాన్స్(Job Chance) ను మెరుగుపర్చడంతో పాటు సైబర్​ సెక్యూరిటీ(Cyber Security)లో నిపుణులను పరిశ్రమకు అందించనుంది. విద్యాద్రులకు అరమయే విధంగా మాడ్యూల్స్(Modules)​తో కోర్సు డిజైన్(Design)​ చేసింది. తద్వారా లెర్నర్స్​ సులభంగా ప్రాథమిక అంశాల(Primary Topics)ను అర్థం చేసుకోవచ్చు.

ఈ సైబర్​ సెక్యూరిటీ కోర్సు(CB Course) గురించి మైక్రోసాఫ్ట్(Microsoft) ఇండియా ప్రెసిడెంట్​ అనంత్​ మహేశ్వరి మాట్లాడుతూ ‘‘సైబర్​ సెక్యూరిటీ స్కిల్ ను అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్​ను రూపొందించాం. ఈ ట్రైనింగ్ లో భాగంగా  పాల్గొనేవారికి ఫండమెంటల్స్(Fundamentals)​లో సర్టిఫికేషన్​(Certification)ను ఉచితంగా అందిస్తాం. ఈ సర్టిఫికెట్​ ఉద్యోగ వేటలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

సైబర్​ సెక్యూరిటీలో పనిచేసే అన్ని స్థాయిల్లో ఉన్న అభ్యాసకులకు అనగా కేవలం బిగినర్స్(Beginners)​కు​ మాత్రమే కాకుండా ఎక్స్​పీరియన్స్(Experience)​ పర్సన్స్​కు కూడా ఉపయోగపడుతుంది.’’ అని చెప్పారు.

మైక్రోసాఫ్ట్​ రెడ్‌మండ్ గ్లోబల్(Microsoft RedMond Global) స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ కోర్సును రూపొందించింది. దీని కింద ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వివిధ డిజిటల్ స్కిల్(Digital Skill) పై  ట్రైనింగ్(Training) ఇవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో, ఇప్పటికే 30 లక్షల మందికి పైగా కొత్త నైపుణ్యా(New Skill)లపై శిక్షణ ఇచ్చింది.

ఈ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవడానికి, ఆసక్తిగల అభ్యాసకులు మైక్రోసాఫ్ట్ ఇండియా స్కిల్లింగ్ ఇనిషియేటివ్(Skilling Innitiative) వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

అందులోని సెక్యూరిటీ స్కిల్లింగ్(Security Skilling) ట్యాబ్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్(Registration) చేసుకోవాలి. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మైక్రోసాఫ్ట్ అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని తెలిపింది.