తెలుగు ఆడియన్స్ కు దేవదాస్ మూవీ తో పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా.ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగు లో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించింది. తెలుగులో రాణిస్తున్న టైం లోనే బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే 2012లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత. అలా కొంతకాలం పాటు టాలీవుడ్‌(Tollywood)కు దూరమైంది. బాలీవుడ్‌(Bollywood)లో అడపాడడపా చిత్రాలు చేసింది.

అక్కడ కూడా వరుస ఆఫర్స్ అందుకోవడం తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

తరువాత కొంతకాలం చిత్రాలకు దూరంగా ఉంది.

ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ , బరువు పెరగడంతో డిప్రషన్ (Depression) లోకి వెళ్లడం తిరిగి కోలుకోవడం జరిగింది.

ఇలియానా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మాస్ మహారాజ తో కలసి నటించింది. అయితే ఆ మూవీ ఆడియన్స్ (Audience)ని పెద్దగా ఆకట్టుకోలేదు.

దీంతో ఆమె మళ్ళీ తెలుగు పరిశ్రమకు దూరమైంది. మూడేళ్ల తర్వాత ఆమె రెండోసారి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది. మాస్ మహా రాజా రవి తేజ కొత్త చిత్రం‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ మూవీ లో ఇలియానా ఒక ఐటమ్‌ సాంగ్‌ (Item song)లో అలరించనున్నారట. దీంతో తెలుగు ఆడియన్స్ ని ముందుకి రానున్నదని  తెలుస్తోంది.

మాస్ మాహారాజ రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే మూవీలో నటిస్తూనే మరోపక్క రామరావు ఆన్ డ్యూటీ మూవీ నటించడానికి రెడీ అవుతున్నాడు.

యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా (Action and Suspense thriller)తెరకెక్కుతున్న, ఈ చిత్రం లో మలయాళ నటి రజీషా విజయన్, దివ్యాన్ష కౌశిక్, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అలాగే హీరో వేణు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫైట్ సీన్స్ చిత్రీకరణ పూర్తైనట్లుగా తెలుస్తోంది.

ఈ గోవా బ్యూటీ కి రీఎంట్రీ లో సక్సెస్ రావాలని కోరుకుందాం ..