బిగ్ బాస్(Big boss)  షో అంటేనే గొడవలు, రచ్చలు, కొట్లాటలు, లవ్ స్టోరీ లు, ఎమోషన్స్, టాస్క్ లు ఇలాంటివే ఉంటాయి కానీ ఈ సీజన్ బిగ్ బాస్ కొంచం డిఫరెంట్ గా  ప్లాన్ చేసాడు. కొత్త కొత్త టాస్క్ లతో  కంటెస్టెంట్స్ సత్తాను  బయటకు తీస్తున్నాడు. అయితే ఈ వారం టాస్క్ లు    ఊహించని విధంగా  వున్నాయి. బిగ్ బాస్  ఇచ్చిన టాస్క్ లో మొత్తం హౌస్ మేట్స్(House mates) ఇద్దరిద్దరు చొప్పున ఎనిమిది జంటలుగా విడిపోయి టాస్క్ ఆడుతున్న సంగతి  తెలిసిందే. ఇక బుధవారం రోజు హౌస్ మేట్స్ కి ఫుడ్ లేకుండా చేసి ఆ ఫుడ్ కోసం టాస్క్ లతో నానా కష్టాలు పెడుతున్న బిగ్ బాస్. ఆ కష్టాలేంటో బుధవారం ఎపిసోడ్ వివరాల్లోకి వెళదాం.

ఇక నిన్నటి  (September 29) ఎపిసోడ్ లో మానస్, సన్నీలు గేమ్ ఎలా ఆడాలన్నదానిపై డిస్కస్ చేస్తారు. సన్నీ ఆకలి వేస్తుందని అంటే ఈరోజుకి తినకుండా మేనేజ్ చేద్దాం  అని అంటాడు మానస్. ఆ తరువాత ఇద్దరూ వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఇక నటరాజ్ మాస్టర్ లోబోకి టాస్క్ అయ్యేంత వరకు నోరు కట్టేయాల్సిందే అని చెప్తాడు. టాస్క్ అయ్యాక  మంచి ఫుడ్ పెడతా అని నటరాజ్ మాస్టర్ లోబో తో అంటాడు. ఆ తరువాత  ఆకలి విలువను తెలుపుతూ మంచి సందేశాత్మక మెసేజ్ ఇవ్వాలని బిగ్ బాస్(Big boss) ఆదేశించడంతో నటరాజ్ మాస్టర్, విశ్వ‌,  యాంకర్ రవి, లోబో, ప్రియలు, ఆకలి రాజ్యం స్పూప్‌(spoof)తో అందరిని అలరించారు.

ఇంట్లో ఆహారాన్ని ఎవరూ తినకూడదని  బిగ్ బాస్ ఆదేశించినప్పటికీ లోబో, సన్నీ ఆహారాన్ని తినడంతో కెప్టెన్‌(captain)గా ఉన్న జెస్సీ కెప్టెన్ గా ఫెయిలయ్యాడని అందుకే అతనితో పాటు అతనికి జంటగా ఉన్న కాజల్ కూడా కెప్టెన్ పోటీదారులుగా అవకాశాన్ని కోల్పోయిందని చెప్తాడు బిగ్ బాస్ , అయితే ఈ టాస్క్ లకు సంచలకురాలిగా కాజల్ ని ఎంపిక చేసిన బిగ్ బాస్(big boss).

దీంతో తాను చెప్తున్నప్పటికీ రూల్స్ బ్రేక్ చేశారని కోప్పడిన జెస్సి. తన వల్ల కెప్టెన్ పోటీదారునిగా అర్హత కోల్పోయిన కాజల్‌కి సారీ చెప్తాడు జెస్సి.

ఆ తరువాత రవి-విశ్వలకు పవర్ రూం యాక్సెస్ లభించడంతో వాళ్లకి పోటీగా ప్రియ-ప్రియాంకల జోడీని ఎంపిక చేసుకుంటారు.  కొన్ని కట్టెలు ఇచ్చి వాటిని ముక్కలుగా చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో.. కండలు తిరిగిన విశ్వ.. టపా టపా కట్టెల్ని ముక్కలుగా చేయడంతో ఆడాళ్లపై  గెలుపు సాధిస్తారు. అయితే వాళ్లు ఫిజికల్ టాస్క్‌లో గెలిచినప్పటికీ పింకీ-ప్రియాంకలు గట్టి పోటీనే ఇచ్చారు. పింకీ అయితే తన ఎఫర్ట్ అంత పెట్టి టాస్క్ ఆడింది . దీంతో అందరూ మెచ్చుకున్నారు.

ఇక  లోబో ఆకలికి తట్టుకోలేక చెత్త కవర్లో ఉన్న పెట్టిన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసాడు ఇది గమనించిన రవి ఏం చేస్తున్నావ్ అంటూ అరుస్తాడు. అయితే ఇదంతా చూసిన నటరాజ్ మాస్టర్ లోబోతో ఆలా చేయొద్దని నీకు ఆకలి వేస్తే తినేసే గేమ్ గురించి ఆలోచించకు అని చెప్తాడు. మరోపక్క సన్నీ-మానస్‌లకు పవర్ రూం యాక్సెస్ లభించడంతో నటరాజ్ మాస్టర్-లోబోలను పోటీదారులుగా సెలెక్ట్ చేస్తారు. విలకు మూగుతారా, తేలుతారు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్(task) లో  ఒక పాయింట్ తేడాతో సన్నీ, మానస్ లు విజేతలుగా నిలుస్తారు.

తరువాత  ఆకలి సహనాన్ని పరీక్షించడానికి బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి మటన్ బిర్యానీ పంపారు. అయితే మానస్-సన్నీ, శ్రీరామ్-హమీదా, షణ్ముఖ్-సిరి లు మాత్రం బిర్యానీ తినరు.

ఇక లోబో బిర్యానీ తిన్నా ,నటరాజ్ మాస్టర్ తినకుండా ఉంటాడు.

బిగ్ బాస్  హౌస్ మేట్స్(House mates) ఇంకా ఎలాంటి టాస్క్ లు ఇవ్వనున్నారో ఈ వారం కెప్టెన్సీ(captaincy) పోటీదారులు ఎవరు కానున్నారో  నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.